పాత డెబిట్ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 తర్వాత నుంచి పనిచేయవు. జనవరి 1 నుంచి రూ పే, మాస్టర్కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్స్ట్రిప్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.గడువు తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త కార్డులను పోస్ట్ లో పంపిస్తున్నాయి. అయినప్పటికీ.. సుమారు 70 శాతం మంది ఖాతాదారులకు మాత్రమే ఇవి చేరినట్లు తెలుస్తోంది. దీంతో తప్పనిసరిగా చిప్ కార్డులు తీసుకోవడంపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఒకవేళ చిప్ కార్డు పొందని వారు సమయం వృధా చేయకుండా..తమ తమ బ్యాంకు శాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాయి. ఉదాహరణకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నెట్బ్యాంకింగ్ తీసుకుంటే.. ఇందులో ఈ–సర్వీసెస్ విభాగంలో ఏటీఎం కార్డు సర్వీసెస్ ఆప్షన్ను ఎంచుకుని కొత్త కార్డుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాగ్స్ట్రిప్ డెబిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తున్నవారి చిరునామాలకు నేరుగా పంపిస్తున్నాయి.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 99 కోట్ల డెబిట్ కార్డులు, 4.2 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయని సమాచారం. ఖాతాదారులు మోసాల బారిన పడకుండా కాపాడాలనే ఉద్దేశంతో 2015 సెప్టెంబర్ నుంచే చిప్ ఆధారిత, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తో పనిచేసే డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయాలంటూ అదే ఏడాదిలో ఆర్బీఐ ఆదేశించింది.అయితే డ్లైన్ను మరికొన్ని నెలలు పొడిగించడంతో 2016 జనవరి తర్వాత నుంచి కొత్తగా ఖాతాలు తెరిచిన వారందరికీ చిప్ ఆధారిత డెబిట్ కార్డులనే బ్యాంకులు జారీ చేస్తున్నాయి. కానీ డెడ్లైన్ కన్నా ముందే మ్యాగ్స్ట్రిప్తో జారీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డులు యథాప్రకారం వాడకంలో కొనసాగుతున్నాయి. దీంతో వీటన్నింటి స్థానంలో కొత్త చిప్ కార్డులు జారీ చేయాలం టూ ఈ ఏడాది డిసెంబర్ 31ని ఆర్బీఐ డెడ్లైన్గా విధించింది. దీన్ని పొడిగించాలం టూ బ్యాంకులు కోరినప్పటికీ.. ఆర్బీఐ తోసిపుచ్చడంతో గడువులోగా చిప్కార్డుల జారీ అనివార్యమైంది.