Home / 18+ / ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం

ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు పథకాలు తెచ్చినప్పుడు వాటిని పక్కాగా అమలుచెయ్యాలి. లేదంటే ప్రభుత్వాన్ని పాలించే పార్టీలతోపాటూ,సంస్థలు, ప్రజలు చిక్కుల్లో పడతారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ పథకం (ఎన్టీఆర్ వైద్య సేవ పథకం).

ఈ స్కీమైతే అమల్లో ఉందికానీ ప్రభుత్వ తీరే దీని కొనసాగింపుకి అడ్డంకిగా మారింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నిన్నటి(మంగళవారం) నుంచి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్య సేవలను నిలపివేశాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.550 కోట్ల రుణాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు సేవల్ని నిలిపేస్తునట్లు తెలుస్తుంది.ఈ విషయంలో 3 నెలలుగా ఆశా ప్రతినిధులు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ దాదాపు 80వేల రోగుల క్లెయిమ్‌లను పెండింగ్‌లో పెట్టింది. ఆరోగ్యశ్రీ బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తామని చెప్పిన మంత్రులు, అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యం కోసం వచ్చినవారిని వెనక్కి పంపిస్తున్నాయి. బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat