నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరిలో అసలైన పోటీ ప్రారంభమైంది.రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల టీడీపీలో చేరుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలోకి చేరతారని ప్రచారంలో ఉన్నది. గతంలో వైసీపీ నుండి కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా నేడు మారిన నేపథ్యంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు వైసీపీలోకి చేరబోతున్నారని ప్రచారంలో ఉన్నది.
ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ బిసి వర్గాలకు చెందిన వారికి రాజకీయ పార్టీలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె గారు మంగళగిరిలో పోటీ చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.ఏది ఏమైనా మంగళగిరి సీటు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది అలాగే వైసీపీ కూడా ఈ సీటు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో టీడీపీ వైసీపీల లో టికెట్లు దొరకని వారు జనసేన లో చేరి పోటీ చేస్తే మంగళగిరి సీటు త్రిముఖ పోటీ గా మారి రసవత్తరంగా మారనుంది. మంగళగిరి లో గెలుపు అన్ని పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.ఏదిఏమైనా నామినేషన్లు వేసే వరకు ఎవరు ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో అనేది అత్యంత సస్పెన్స్ గా మారింది,అప్పటివరకు వేచి చూడాల్సిందే