సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు మాత్రం ఆదరణ కరువైంది.
ప్రాణాలకు తెగించి అతను చేసిన సాహసం అతనితోనే ఉండిపోయింది.కానీ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అతని సాహసాన్ని గుర్తించింది. లక్ష రూపాయలను బహుమతిగా ఇచ్చింది.ఇంతకు అసలు విషయానికి వస్తే డిసెంబర్ 17న ముంబైలోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో చిక్కుకున్న 10 మందిని ఈ డెలివరీ బాయ్ సిద్ధ్రామేశ్వర్ సిద్ధ్రామ్ ప్రాణాలకు తెగించి కాపాడాడు.ఈ ప్రయత్నంలో అతనికి గాయాలు కూడా అయ్యాయి.ఐన అతడు అవి లెక్కచేయకుండా వాళ్ళని కాపాడాడు.సిద్ధూకు మహారాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ లక్ష రూపాయలను బహుమతిగా అందజేసి అతడిని అభినందించారు.