Home / 18+ / తురకశాసనం నుండి ప్రారంభమైన జగన్ పాదయాత్ర

తురకశాసనం నుండి ప్రారంభమైన జగన్ పాదయాత్ర

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. జగన్ 337వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం ఇచ్చాపురం నియోజకవర్గంలోని తురక శాసనం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సోంపేట మండలంలోని పాలవలస, కొర్లాం, బారువకూడలి మీదుగా లక్కవరం వరకు జగన్‌ పాదయాత్ర చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల మాదిరిగానే ఇచ్చాపురంలోనూ అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగంతో పాదయాత్ర దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో పాదయాత్ర ముందుకు కదులుతోంది. జగన్ ను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తామూ భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున వస్తున్నారు. జగన్ తో మాట్లాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat