బోగస్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారనే పిటిషన్ పై విచారణను ఈ నెల 21కి విజయవాడ హైకోర్టు వాయిదా వేసింది. ఏపిఐఐసి కీలక సూత్రధారి అని శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పిల్ వేశారు. రాష్ట్రంలో 14,900 ఎకరాలను సుమారు 4వేల కంపెనీలకు ఏపీఐఐసీసీ కేటాయించిందని పిటిషనర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.వీటిల్లో ఎక్కువశాతం బోగస్, షెల్ కంపెనీలేనని పిటీషన్ లో పేర్కొన్నారు. రైట్ టూ ఇన్ఫర్ మేషన్ ద్వారా నాలుగు వందల కంపెనీల వివరాలు కోరితే..కేవలం 200 కంపెనీల వివరాలు మాత్రమే అధికారులు తెలిపారని పిటిషనర్ చెప్పుకొచ్చారు.
అందులో 25 కంపెనీలు మాత్రమే సక్రమమైనవని, మిగిలిన 175 కంపెనీలు బోగస్ అంటున్నారు శ్రవణ్ కుమార్.తన తగ్గర ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారాయన. బోగస్, షెల్ కంపెనీలపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తోనైనా కానీ, ఏసీబీతోనైనా విచారణ జరిపించాలని పిటీషనర్ ధర్మాసనాన్ని కోరారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, పలు కంపెనీలు, ఏపీఐఐసీసీ, సీబీఐ, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ను చేర్చారు. ఈ ప్రజా ప్రయోజన వాజ్యం పై విచారణ జరిపిన విజయవాడ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 21కు వాయిదా వేసింది.