Home / 18+ / కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత…ఆలయంలోకి శ్రీలంక మహిళా

కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత…ఆలయంలోకి శ్రీలంక మహిళా

శబరిమలలో అయ్యప్పస్వామిని శ్రీలంక మహిళ శశికళ (47) గురువారం రాత్రి దర్శించుకున్నారా? లేదా? అన్న అంశంపై గందరగోళం తొలిగింది. ఆమె ఆలయం లోపలికి వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ధ్రువీకరిస్తూ కేరళ పోలీసు వర్గాలు సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదలచేశాయి. తన భర్త శరవరణ్‌తో కలిసి శశికళ తన తలపై ఇరుముడితో ఆలయంలో లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు ఫుటేజీ సూచిస్తున్నది. దీన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి. ఇద్దరు మహిళలు బుధవారం దేవాలయం లోపలికి ప్రవేశించడంపై రాష్ట్రమంతా ఆందోళన సాగిననాడే మరో మహిళ (శశికళ) ఆలయంలోకి వెళ్లి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం. కానీ ఆలయంలోకి ప్రవేశించినట్లు వచ్చిన వార్తను ఆమె శుక్రవారం ఉదయం తోసిపుచ్చారు. భద్రతా కారణాల వల్లే ఆమె తన పర్యటన వివరాలను దాచి పెట్టారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat