కెరీర్లో మొదలుపెట్టిన మొదటి సినిమాతోనే తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్..గమ్యం సినిమాతో అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.అయితే ఈ సినిమా కమర్షియల్గా అంతగా సక్సెస్ కాలేదు.తన రెండో చిత్రంమైన వేదం బాగున్నపటికి విజయం సాధించలేదు.
తాజాగా క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది సినిమా తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత కథ కూడా అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పొచ్చు ఎందుకంటే సినిమా చూసిన ప్రేక్షకులు బయటకు వచ్చాక పర్వాలేదు అని చెప్పుకుంటున్నారు తప్ప అద్భుతంగా ఉందని ఎవరి నోటి నుండి రావడం లేదు.
ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎలా ఉండాలో అలా లేదనే టాక్ బయట వినిపిస్తుంది.క్రిష్ గొప్ప దర్శకుడు అనడంలో సందేహం లేదు అయితే ఇందులో కొన్ని సీన్లను అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్, కొన్ని సీన్లను మాత్రం డ్రామాలో మాదిరిగా తీశాడు.ఈ విషయంలో క్రిష్ను నిందించడానికి లేదు. ఎందుకంటే క్రిష్ ఈ సినిమాకు మధ్యలో వచ్చి చేరిన విషయం తెలిసినదే. మొదట దీనికి తేజ దర్శకత్వం వహించాడు. బాలయ్యతో విభేదాలు రావడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు తేజ.
దీంతో క్రిష్ను బలవంతంగా ఒప్పించాడు బాలయ్య.ఈ చిత్రం కోసం బాలీవుడ్ మణికర్ణిక సినిమాను మధ్యలోనే వదిలేశాడు క్రిష్.మొదటి నుండి క్రిష్ ఉండుంటే సినిమా ఎలా ఉండేదో తెలిసేది. ఏది ఏమైనప్పటికి సినిమా మాత్రం అనుకున్నంత లేదననే అభిప్రాయం వెల్లడవుతోంది.