Home / 18+ / చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంరద్ర‌బాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. తెలుగుదేశం పాలనపై విసుగుసోయిన బైరెడ్డిప‌ల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

జగన్ పాదయాత్ర ప్రభావం, చంద్రబాబు అబద్ధపు హామీల ప్రవాహంతో విసిగిపోయిన తెలుగుతమ్ముళ్లు వైసీపీలో చేరుతున్నారు. వైఎస్ఆర్‌సీపీలో చేరిన వారిలో రాజప్ప, వెంకటా చలపతి, దేవన్న, రవి, రెడ్డెప్ప, మణి, జైరాం, ఫయాజ్, రఘుపతి, బాబు, గంగయ్య, సుబ్రమణ్యం, విశ్వనాథ్, గోపాల్, తిరుమలేష్, శీనప్ప, ఆంజి, వెంకటప్ప, ఈశ్వరప్ప, రంజిత్, అబ్బు, ఎం.వెంకటేష్‌ తదితరులు ఉన్నారు. ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విధంగా వైసీపీలోకి వలసలు రావడం ఆ పార్టీకి మంచి ఊపునిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat