Home / 18+ / జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు

జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.ఈ కేసు ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని బొత్స దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడమేంటని, భయంతోనే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు.

ఎన్‌ఐఏ విచారణ చేయాలని కోర్టే తీర్పు ఇచ్చిందని, ఏపీ పోలీసుల నివేదికలో కూడా వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా ఉందన్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని చంద్రబాబు సాక్ష్యాత్తే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయడాన్ని బొత్స ఖండించారు. దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం సరికాదనీ, ఎన్‌ఐఏ విచారణను రీకాల్‌ చెయ్యాలని బొత్స కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat