భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో అయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్కు హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్టు తెలిపారు .అయితే ఈ విషయాన్ని అమిత్ షానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భగవంతుడి దయ, కార్యకర్తల ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని ట్వీట్ చేశారు.
मुझे स्वाइन फ्लू हुआ है, जिसका उपचार चल रहा है। ईश्वर की कृपा, आप सभी के प्रेम और शुभकामनाओं से शीघ्र ही स्वस्थ हो जाऊंगा।
— Amit Shah (@AmitShah) January 16, 2019