పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ పల్లెలు రాజకీయ చైతన్యంతో…రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో బరిలో దిగడం అనే ప్రక్రియ కంటే…ఏకగ్రీవంతో ముందుకు సాగి ఐక్యంగా గ్రామాన్ని అభివృద్ధి చెందించుకునేందుకు ఆయా గ్రామాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి స్వగ్రామం వరికోల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని వరికోల్ నియోజకవర్గంలో మరో దఫా ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవంగా, గ్రామస్తుల ఐక్యతతో ముగిశాయి. వరికోల్ శ్రీమంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో గ్రామ ప్రజలు నడిచి మరోసారి ఐక్యతను చాటారు. వరికోల్ గ్రామ ప్రజానికం తమ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సాదు నిర్మలసమ్మిరెడ్డిని ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి చేశారు. ఐక్యతనే మన విజయానికి బాసట అని టీఆర్ఎస్ యువనేత స్వగ్రామం మరోమారు చాటిచెప్పిందని పలువురు పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి నీ అందరూ అభినందిస్తున్నారు..