వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొద్దికాలం క్రితం కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అదే వెన్నుపోటు రాజకీయాలను అమల్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో సీనియర్ నేతతో కలిసి తన భార్య పెదనాన్న అయిన సీనియర్ నేతకు షాకిచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతే మాజీ మంత్రి డీకే అరుణ.
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు లోకసభ స్థానాలుండగా..వీటిలో నాగర్ కర్నూల్ సీట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డిపై ఓడిపోయిన జైపాల్ రెడ్డి మహబూబ్ నగర్ సీటు నుంచి మళ్లీ పోటీకి యత్నిస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయిన అరుణ ఎంపీ సీట్ పై కన్నేశారు.మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిన డీకే అరుణ ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కలుపుకొని పోతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో దోస్తీ చేసి, జైపాల్ రెడ్డికి చెక్ పెట్టడం ద్వారా మహబూబ్ నగర్ టికెట్ సాధించాలనే పట్టుదలతో డీకె అరుణ ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, డీకే అరుణకు సహకరించి జైపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ దక్కకుండా చేయడం వల్ల తన మామకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడవనున్నారని పాలమూరు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.