Home / ANDHRAPRADESH / కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 60 వేల మెజార్టీతో గెలవబోతుందా..!

కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 60 వేల మెజార్టీతో గెలవబోతుందా..!

వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దింపినా సరే.. ముగ్గురు కలిసి ఒకరినే బరిలో దింపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, ఖచ్చితంగా 50, నుంచి 60 వేల మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం రత్నపల్లె పంచాయతీ యాదరాళ్ల గ్రామంలో పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మరియు వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మండల కన్వీనర్ రవి రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి 50కుటుంబాలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను ఏవిధంగా మోసం చేశారో వివరించింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా కేఈ కృష్ణమూర్తి పత్తికొండ నియోజకవర్గం లో కనీసం మంచినీటి సమస్యను కూడా పరిష్కరించ లేకపోయారన్నారు. కెఇ కుటుంబం బీసీ నేతలందరిని అణగదొక్కి వారికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు . అంతేగాక రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి తెలియజేస్తూ పాత నార్లపురం గ్రామంలోకంగాటి శ్రీదేవి వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మండల కన్వీనర్ రవి రెడ్డి పాత నార్లపురం వెంకటాపురం వెల్దుర్తి మండల వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat