పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా కెఎస్ జవహర్ గెలిచారు.ఐతే మొన్నటి మంత్రివర్గం విస్తరణలో కొత్తగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం మంత్రి జవహర్పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది.రానున్న ఎన్నికల్లో మంత్రి జవహర్కు టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు,పార్టీ శ్రేణులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు.
గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని జవహర్ పై ఫిర్యాదు చేశారు.పార్టీలో సీనియర్ నాయకులు మరియు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నేతలకు జవహర్ గౌరవం ఇవ్వడంలేదని మండిపడ్డారు.కొవ్వూరు నియోజకవర్గంలో నాయకులతో పనిలేదని ఎందుకంటే ఇక్కడ ప్రజలను పాలించేది నాయకులు కాదని బ్రాందీ షాపుల్లో పనిచేసే వారే పార్టీని నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జవహర్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వోద్దని అధిష్టానాన్ని కోరారు.ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా ఓడిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు.