వర్షం కారణంగా, వెలుతురు లేమి మరియు మంచు కురుస్తున్నదనే కారణంతో క్రికెట్ మ్యాచ్లు ఆగిపోవడం అందరికీ తెలిసిందే.అయితే క్రికెట్ చరిత్రలో తొలిసారి కళ్లలో సూర్యుని కిరణాలు పడటంతో మ్యాచ్ ఆగిపోయిన ఘటన నిన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన భారత్ విరామ సమయానికి 9 ఓవర్లలో వికెట్లు పడకుండా 41 పరుగులు చేసింది.విరామం అనంతరం బ్యాటింగ్కు దిగిన వెంటనే రెండో బంతికే రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది.
అనంతరం కోహ్లీ క్రీజులోకి వచ్చి నలుగు బంతులు ఎదుర్కున్నాడ.ఈ సమయంలో సూర్యకాంతి నేరుగా బ్యాట్స్మెన్ కంట్లో పడుతుండడంతో గమనించిన అంపైర్లు మ్యాచ్ను కాసేపు నిలిపేశారు.అంతా సద్దుమణిగిన తరువాత మరలా మ్యాచ్ మొదలుపెట్టారు. దీంతో సూర్యుడి కారణగా మ్యాచ్ ఆగిపోవడం ఇదే తొలి సారి అని అంటున్నారు..చరిత్రలో ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు.