తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో హత్య జరిగినట్టు తొలుత అనుమానించిన పోలీసులు కీలక నిందితుడు రాకేశ్రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాంగా జయరాంను తానే హత్య చేసినట్టు రాకేశ్రెడ్డి ఒప్పుకున్నట్టు తెలిసింది. రాకేశ్రెడ్డికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో రాకేశ్రెడ్డి నేరచరిత్ర బయటపడినట్టు సమాచారం.
అయితే, దీనికి తోడుగా ఆయనకు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఏపీకి చెందిన పేరొందిన రాజకీయ నాయకులకు రాకేశ్రెడ్డి సుపరిచితుడేనని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడని, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున ముఖ్యనాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడని మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాకేష్రెడ్డి నేరచరిత్ర కలిగి ఉండటంతోపాటు టీడీపీలో చురుకుగా ఉన్నాడని సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ఈ మేరకు పలు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీకి చెందిన `ముఖ్య`నేత ఆఫీసులో రాకేశ్రెడ్డికి మంచి పరిచయాలు ఉండటంతో పాటు ఆయన `తనయుడు` నడిపే టీంలో కూడా రాకేశ్ సభ్యుడిగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఏపీలో పైరవీలు చేసేవాడని తెలిసింది. జయరాంను హత్యచేసి తెలంగాణలో పడేసినా, కాల్చేసినా పోలీసు దర్యాప్తు సీరియస్గా ఉండి తప్పించుకొనే పరిస్థితి ఉండదని భావించినట్టు తెలిసింది. ఏపీలో రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలతో తేలికగా హత్యకేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించవచ్చని, పోలీసులపై ఒత్తిడి తెచ్చి బయటపడొచ్చనే ఆలోచనతో జయరాం మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తీసికెళ్లినట్టు తెలుస్తోంది. తాజా ఎపిసోడ్ బయటకు రావడంతో…ఏపీలోని `ముఖ్య`నేత కలవరంలో పడినట్లు సమాచారం.