రంగు రంగుల బొమ్మలతో తరగతి గదులు, కాకతీయ కళాతోరణం, బతుకమ్మ రూపాన్ని తెలియజేశేలా ఉన్న ఈ పాఠశాలను చూసి ఏ కార్పోరేట్ స్కూలో అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోని వీర్నపల్లి మండలం రంగంపేట్ ప్రభుత్వ పాఠశాలని సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ ) నిధులతో ఇలా ఆకర్షణీయంగా తయారుచేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలా పాఠశాల తరగతి గదులను అందంగా, ఆకర్షణీయంగా తయారుచేశారు.