Home / 18+ / ఏపీలో వార్ వన్ సైడ్…అవంతి బాటలోనే మరో ఎంపీ

ఏపీలో వార్ వన్ సైడ్…అవంతి బాటలోనే మరో ఎంపీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్పులు,చేర్పులు సహజమే.అది ఏ పార్టీలో ఐన జరుగుతుంది.ఇక్కడ మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు మింగుడు ప‌డ‌టంలేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు టీడీపీని వదిలేయడంతో బాబు కు చమటలు పడుతున్నాయి.ఇప్పటికే అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి బయటకు వచేయడమే కాకుండా కొద్దిసేపటి క్రితమే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఇది ఇలా ఉండగా అవంతి బాటలోనే మరో ఎంపీ పార్టీకి గుడ్‌బాయ్ చెప్పనున్నారు.

అమ‌లాపురం ఎంపీ రవీంద్రబాబు టీడీపీకి గుడ్‌బాయ్ చెప్పనున్నారని సమాచారం. గ‌త కొంత‌ కాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న రవీంద్రబాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నారని తెలుస్తుంది. కోన‌సీమ రైతుల‌ను ఆదుకొనేందుకు ఆయన కష్టపడుతుంటే టీడీపీ నాయకులే ఈ పనులను అడ్డుకుంటున్నారని ఈ మేరకు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పై మండిపడ్డారు.అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పార్ల‌మెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేరని సమాచారం.అంతేకాక ఈరోజు ఉదయం చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫ‌రెన్స్ కూడా ఆయన కనిపించలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat