ఏపిలో పని చేయలేక ఇక్కడి నుండి అనేక మంది అధికారులు వెల్లిపోయారని.. దీంతో కేంద్ర సర్వీసులకు చెందిన 20 మంది అధికారులు ఏపికి డిప్యుటేషన్ మీద వచ్చారని ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ వివరించారు. ఈ 20మందిలో 15మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందిన కమ్మ వారేనని దుయ్యబట్టారు. వారిలో కేవలం ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం అధికారి ఉంటే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. APPSC ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ ముఖ్యమంత్రి బంధువని, ఒకే కులానికి ముఖ్యమంత్రి దోచి పెడుతున్నారన్నారు.
సీఎం కార్యాలయంలో నలుగురు అధికారులు ఉంటే వారిలో రాజమౌళి, సాయి ప్రసాద్ లు కూడా కమ్మవారనట.. చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే సంప్రదించే ఆయన పర్సనల్ సెక్రటరీ, టలిజెన్స్ విభాగాధిపతి వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ విభాగంలో తీసుకున్న రిటైర్డ్ అధికారి యోగానంద్, కో ఆర్డినేషన్ పదవితో నియమించుకున్న ఘట్టమనేని శ్రీనివాస్ కూడా కూడా కమ్మవారేనట.. అలాగే మొత్తం 37మందికి DSP లుగా ప్రమోషన్ ఇస్తే అందులో 35 మంది పీఎంకు పార్టీ పరంగా సమాచారం ఇచ్చి అన్ని వ్యవహారాలు చక్కబెట్టే టిడి జనార్దన్ కూడా చంద్రబాబుసామాజిక వర్గానికి చెందిన వారేనని పేర్కొన్నారు.
ఆయనకు కుల పిచ్చి లేదని చెబుతు న్నా చుట్టూ ఒకేకులం వారు ఉన్నారని విమర్శించారు. వారంతా ఆంధ్రప్రదేశ్ ను కబళించేస్తున్నారన్నారు. పోలీస్ శాఖలో మొత్తం తనసామాజిక వర్గం వారినే నియమించుకుని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆమంచి వ్యాఖ్యలతో గతంలో తోటి కమ్మ కులస్థులైన పోసాని, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్, సీపీఐ సీనియర్ నేత నారాయణ సైతం చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ అని వివిధ సందర్భాల్లో తెలిపారు.