2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రెండోసారి కూడా అధికారంలోకి రావాలని పట్టుదలతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సొంత పార్టీ నాయకులే జుంపింగ్ లు చేయడంతో ఇప్పుడు బాబుకు ఇది పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.చంద్రబాబే స్వయంగా పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్న ఏ ఒక్క నాయకుడు పట్టిచుకోవడం లేదు.బాబుతో మాట్లాడిన తర్వాతే పార్టీ మారిపోతున్నారు.ఇప్పటికే మేడా,ఆమంచి,అవంతి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు మరికొంద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నాయకులు వైసీపీలోకి జంప్ కు రెడీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.వైసీపీలో చేరడానికి మాగుంట సర్వం సిద్ధంగా చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ వార్త టీడీపీ వాళ్ళకు మింగుడు పడడం లేదు.విషయం తెలుసుకున్న బాబు వెంటనే శ్రీనివాస్ రెడ్డిని పిలిపించి చర్చించారు.ఆమంచి కూడా ఇదే తరహాలో చంద్రబాబుని కలిసిన తర్వాతే
వైసీపీలోకి జంప్ అయ్యారు.మరి ఇప్పుడు మాగుంట కూడా బాబుకు షాక్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాలి.అన్ని బాగుంటే తాను ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. అయితే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇంక మాగుంట శ్రీనివాస్ రెడ్డికి జగన్ ని కలిసి పార్టీ కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలింది.