Home / 18+ / ముందు నుయ్యి…వెనుక గొయ్యి..కాంగ్రెస్‌లో కొత్త ఆందోళ‌న‌

ముందు నుయ్యి…వెనుక గొయ్యి..కాంగ్రెస్‌లో కొత్త ఆందోళ‌న‌

ముందు నుయ్యి….వెనుక గొయ్యి…ఇది స్థూలంగా టీ కాంగ్రెస్ ప‌రిస్థితి అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే నుయ్యి కంటే, గొయ్యే మేల‌ని వారు భావిస్తున్న‌ట్లు పేర్కొంటున్నారు. ఇదంతా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల గురించి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారిన సంద‌ర్భం గురించి.

ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. 21 మంది ఎమ్మె ల్యేల బలం ఉన్నదన్న నమ్మకంతో కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిని బరిలో నిలిపింది. ఈ మేరకు గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కలుపుకొంటే తమకు సంఖ్యాబలం సరిపోతుందని కాంగ్రెస్ భావించింది. కానీ ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు సీఎం కేసీఆర్ పనితీరుకు ఫిదా అయ్యారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 19 నుంచి 17కు పడిపోయింది.

మరోవైపు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకే మద్దతు ఇస్తారన్న ఆశలపైనా నీళ్లు చల్లినట్టయింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని, టీఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ముగ్గురు ఎమ్మెల్యేల లోటు ఏర్పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్‌కు ముగ్గురు తగ్గడంతో గూడూరు నారాయణరెడ్డి బరిలో ఉంటారా? తప్పుకుంటారా? అనే అయోమయం నెలకొన్నది. సంఖ్యాబలం లేకుండా పోటీచేయడం మంచిది కాదని చాలా మంది కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ బరిలోనుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat