ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అందరి నోటినుండి వచ్చే మాట ఏపీ సార్వత్రిక ఎన్నికలు కోసమే.అయితే అంతకుమించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మా అధ్యక్షుడుగా ఉన్న శివాజీ రాజా పదవీ కాలం ఈ నెల 10న ముగియనుంది.దీంతో ఎన్నికలకు మళ్లీ సిద్దం అవ్తున్నారు.అయితే
శివాజీ రాజా ముందుసారి ఏకగ్రీవంగా 740మంది ఎన్నికొని అతడిని ప్రెసిడెంట్ చేసారు.అంతకముందు రాజేంద్రప్రసాద్,జయసుధ మధ్య పోటీ ఉండగా మెజారిటీ మెంబెర్స్ తో రాజేంద్రప్రసాద్ గెలిచారు.ఈసారి కూడా ‘మా’ ఎన్నికలకు శివాజీరాజా రెడీ అవుతున్నారు.ఈమేరకు హీరో శ్రీకాంత్,శివాజీరాజా ఈరోజు చిరంజీవిని కలిసారు.శివాజీరాజాకి పోటిగా నరేష్ సిద్ధంగా ఉన్నారు.నరేష్ అధ్యక్ష పదవికి, జీవిత రాజశేఖర్ లు ప్యానల్ లో కీలక పదవుల కోసం పోటీ చేస్తున్నారు. నరేష్,రాజశేఖర్ నిన్ననే చిరజీవిని కలిసారు