గుంటూరు జిల్లా సతైనపల్లిలో సభాపతి కోడెల, కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి అవినీతి,దందాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి.అధికారం ఉందికదా అని శివ ప్రసాద్ కుటుంబ మొత్తం అవినీతికి పాల్పడుతుంది.ఈమేరకు ప్రతిపక్షాలు వాళ్ళ అవినీతి,దందాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.అంతే కాదు న్యాయ విచారణ కోసం దర్నా చేస్తే వారిని ఆరెస్ట్ చేసి సత్తెనపల్లిలో 144 సెక్షన్ అమలుచేశారు.
తాజాగా కోడెల, ఆయన కుమారుడి నేర చరిత్ర గురించి ఓ ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ ఆడియోలో…ఎన్నో నేరాలకు కేంద్ర బిందువు కోడెల శివప్రసాద్ స్పీకర్ గా సత్తెనపల్లి శాసనసభ్యుడుగా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏం చేశాడో వాటికోసం వివరించారు.
మొదటిగా ఈ ఐదు సంవత్సరాలు కోడెల తన కుమారుడు సత్తెనపల్లిలో అమాయకమైన ప్రజల దగ్గర నుండి దౌర్జన్యంగా భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసారు.ఇందులో వందల కోట్ల రూపాయలు అన్యాయంగా సంపాదించారు.ఆయన కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్న చిన్నోడు నుండి పెద్దోడు వరకు,పేదవాడి నుండి బిజినెస్ మ్యాన్ వరకు అందరి దగ్గర టాక్స్ చేస్తారు.ప్రజలకోసం నియముతులైన మున్సిపల్ ఉద్యోగులను సొంత అవసరాలకు వాడుకోవడం,అన్న క్యాంటీన్ పేరుతో వచ్చిన భోజనాలు సైతం అమ్ముకుంటారు.ఈ నియోజకవర్గం అంతా కోడెల దోపిడి ,దౌర్జన్యం, అన్యాయం ,అక్రమంతో నిండిపోయింది.ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీ దెబ్బాలు,ఇంకా ఎక్కువ మాట్లాడితే కిడ్నాప్ లు చేస్తారు.
ఇంత జరుగుతున్న ఎవరూ పట్టించుకోరు..ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరిగిన మౌనంగా ఉంటారు తప్ప ఎలాంటి చర్య తీసుకోరు.తన కుటుంబం చేసిన దోపిడి, దౌర్జన్యం, అన్యాయం ,అక్రమాల కోసం వివరించిన ఈ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియా లో హలచల్ చేస్తుంది.