ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలోకి చేరికలు వేగం పుంజుకున్నాయి. ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైసీపీలో చేరారు. లోటస్పాండ్లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు తదితరులు అక్కడ ఉన్నారు. వీరితో పాటు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దేవరపల్లి ఎంపీపీ, ఇతర నాయకులు కూడా వైసీపీలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యాడానికి తమం వంతు కృషి చేస్తామన్నారు.