Home / 18+ / రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు.. పార్టీ జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు

రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు.. పార్టీ జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు

వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలను సజీవంగా ఉంచేందుకు పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లైన సందర్భంగా ప్రజా జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతీ కుటుంబానికి అధ్యక్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి శాంతి జెండా ఆవిష్కరించారు. పలాస సమన్వయకర్త సీదిరి అప్పల రాజు పార్టీ జెండాను ఎగురవేశారు.

శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. కిల్లి కృపారాణి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పాలకొండ కార్గిల్‌ జంక్షన్‌లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కళావతి జెండా ఆవిష్కరించారు. విజయనగరం జిల్లాలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర వైయస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. పార్వతీపురం సమన్వయకర్త జోగారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. చినమేరంగి కోటలోకురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, గోలుకుంట మండల కేంద్రాల్లో ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించారు. విశాఖ సౌత్‌ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ రమణమూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ పార్టీ జెండాను ఆవిష్కరించారు.విశాఖ కార్యాలయంలో నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్,ఇంఛార్జ్‌ కంతేటి సత్యనారాయణ రాజు, పార్లమెంటు అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, కేకే రాజు,తిప్పల నాగిరెడ్డి, కొయ్య ప్రసాద్‌ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. తూర్పుగోదావరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనాల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ముమ్మిడివరం వైయస్‌ఆర్‌సీపీ కార్యాయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి పెన్మత్స చిట్టిరాజు, అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు.

ప్రత్తిపాడు కార్యాలయంలో పార్టీ కోఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండల కేంద్రాల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంత‌పురం జిల్లాలో వాడవాడలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి, భీమవరం నియోజకవర్గాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీఎల్ నరసింహరాజు ఆద్వర్యంలో పార్టీ కార్యాలయాల వద్ద జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం వర్ధిలాలని పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలని పీవీఎల్ ఆకాంక్షించారు. వైసీపీ పేదల పార్టీ అని, వైయస్‌ జగన్‌ సీఎం అయితే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat