తెలుగుదేశం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆమె… త్వరలోనే టీడీపీకి గుడ్బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీని వీడి… తిరిగి వైసీపీలో చేరాలని బుట్టా కుటుంబ సభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరడంతో బుట్టా రేణుకకు తెలుగుదేశం అధిష్టానం టికెట్ ఇవ్వలేకపోయింది. అయితే, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని సూచిచింది. అక్కడ గెలుపు అవకాశాలు లేవంటూ ఆదోని నుంచి పోటీ చేసేందుకు బుట్టా రేణుక నిరాకరించారు. కర్నూలు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో బుట్టా రేణుక మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయ వెళ్లనున్న బుట్టా దంపతులు… వైఎస్ జగన్ను కలవనున్నారు.