తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితా ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని.. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని మరో వ్యక్తికి చంద్రబాబు కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ప్రకటించారు.
తనను కాదని టికెట్ ఇచ్చిన నేలపూడి స్టాలిన్ బాబుని ఓడించడమే తన టార్గెట్ అని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ప్రకటించారు. ఇందుకోసం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. అయితే, ఆయన టీడీపీకి రాజీనామా చేసే మరో పార్టీలో చేరతారా? స్వతంత్రంగానే బరిలోకి దిగుతారా? అనే చర్చ నడుస్తోంది. పులపర్తి నారాయణమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.