Home / 18+ / కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా

కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు పదును పెట్టారు. మతాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారు. తాజాగా క్రిస్టియన్ ఓట్లు చీల్చడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను రంగంలోకి దించారు. కారణం కేఏ పాల్ ప్రతీ సభలో అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించడం మాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నాడు. పాల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి. అలాగే కాపు ఓట్లు చీల్చడానికి జనసేనను గత రెండు పర్యాయాలుగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే గత ఎన్నికల్లో కలిసి తిరిగిన పవన్, చంద్రబాబు ఈ ఎన్నికల్లో విడివిడిగా రాజకీయ ప్రచారాలను చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ముస్లిం మైనారిటీ ఓట్లు చీల్చడానికి వైసీపీ-బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.

అదే విథంగా జనసేన పరోక్షంగా టీడీపీకి మేలు చేసేలా ఎస్సి-ఎస్టీ ఓట్లు చీల్చడానికి బీఎస్పీ-జనసేన పొత్తును కూడా ఇప్పుడు తెరపైకి తెచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో వేలకొద్ధి వైసీపీ ఓట్లు తొలగించి, వేలకొద్ది టీడీపీ దొంగోట్లు జమ చేయడం ద్వా రా ఓటింగ్ లో వైసీపీ ఓట్ల శాతాన్ని తగ్గించి టీడీపీ ఓటింగ్ ను పెంచుకుంటున్నారు. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గానికి 50కోట్లు లిక్విడ్ క్యాష్ ను పంపినట్టు వార్తలొస్తున్నాయి. పోలీసులు అండ-అధికారుల సహాయంతో పాటు మీడియా సపోర్ట్ తో పోల్ మేనేజ్మెంట్ చేసి గెలవాలనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ సాంప్రదాయక ఓటింగ్ వైసీపీ కి రాకుండా చేయడం ద్వారా కూడా గెలుపుపై నమ్మకం లేక హత్యారాజకీయాలు చేసి ప్రత్యర్థులను బయపెడుతూ లొంగదీసుకోవాలనుకోవాలనుకుంటున్నారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోడానికి ఇన్ని చెయ్యాలా అధికారం అంటే ఎందుకు బాబు నీకింత పిచ్చి అంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్నునమ్మంబాబూ అంటూ చంద్రబాబుకు దండం పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat