ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు అందరి చూపు ప్రజలు పైనే పడింది ఎందుకంటే..ఎన్నికల్లో ఓ అభ్యర్ధి గెలవాలంటే డబ్బులు, చీరలు, మధ్యం ఇలాంటివి ఆశపెట్టి ఓట్లు రాబట్టుకుంటున్నారు. ఇందుకుగాను పోలీసులు కూడా ఎక్కడా ఏ తప్పులు జరగకుండా వాళ్ళు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ తూమకుంట చెక్పోస్టు వద్ద రూరల్ పోలీసులు ఆ బస్సు ను తనిఖీ చేసారు. తనిఖీ అనంతరం అందులో పది మూటల్లో ఉండగా సుమారు 1,500 చీరలు ఉన్నాయి.వాటికి రసీదులు లేకపోవడంతో ఎన్నికలు కోసమే వీటిని తీసుకెల్తున్నారని అనుమానంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.అంతే కాకుండా ఇందులో సిగరేట్ బాక్సులు కూడా భారీగా లభించాయి.
ఇది ఇలా ఉండగా అదే చెక్పోస్టు నందు ఎక్సైజ్ పోలీసులు కర్ణాటక నుండి మద్యం తరలిస్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని వాటిని తరలిస్తున్న మానేంపల్లి హనుమంతప్పను అరెస్టుచేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐలు ఉమాదేవి, మల్లికార్జున తెలిపారు.