వచ్చే నెల ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో పదహారు స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాలను శాసించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తోన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమరంకోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి,ఎంపీ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించారు. ఒకపక్క తన తనయుడు,యువనాయకుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేయించారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. కేసీఆర్ ప్రకటించిన పేర్లు ఇలా ఉన్నాయి..
1)నిజామాబాద్ -కల్వకుంట్ల కవిత
2)జహీరాబాద్-బిబి పాటిల్
3)మెదక్-కొత్త ప్రభాకర్ రెడ్డి
4)ఆదిలాబాద్-నగేష్
5)కరీంనగర్-బి.వినోద్ కుమార్
6)పెద్దపల్లి-నేతగాని వెంకటేష్
7)వరంగల్-పసునూరి దయాకర్
8)మహబూబాబాద్-మాలోత్ కవిత
9)ఖమ్మం-నామా నాగేశ్వరరావు
10)మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డి
11)నాగర్ కర్నూలు-పి.రాములు
12)నల్లగొండ-వేమిరెడ్డి నరసింహ రెడ్డి
13)భువనగిరి-బూర నర్సయ్య గౌడ్
14)మల్కాజిగిరి-రాజశేఖర్ రెడ్డి
15)చేవెళ్ల-రంజిత్ రెడ్డి
16)సికింద్రాబాద్-తలసాని సాయికిరణ్ యాదవ్
17)హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్