ఎప్పుడూ వివాదాలతో సంచలన వ్యాఖ్యలు చేసే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు వచ్చినా హంగూ ఆర్భాటాలతో వస్తారు అలాంటిది నిన్న మాత్రం మిట్ట మధ్యాహ్నం గుంతకల్లుకు మెరుపులా వచ్చి వెళ్ళిపోయారు.తను గుంతకల్లుకు ఇలా వచ్చి వెళ్లడంపై అంతా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడు ఇంటికి రహస్యంగా వెళ్లి కలిసారు.ఎమ్మెల్యే జితేంద్రగౌడు, ఆయన సోదరుడు ఆర్ శ్రీనాథ్గౌడును కలిసి దాదాపు అరగంటకు పైగా రహస్యంగా మాట్లాడుకున్నారు.
తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తానంటూ అలాగైన పార్టీ అభ్యర్థులందరూ గెలవాలని చర్చించినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా జనసేన అభ్యర్థి కొట్రికే మధుసూదన్ను వ్యవసాయ మార్కెట్యార్డు కమిటీ కార్యాలయానికి పిలుపించుకొని రహస్య మంతనాలు జరిపారు. అంతేకాకుండా మున్సిపల్ చైర్ పర్సన్ కోడెల అపర్ణ ఇంటికి వెళ్లి కూడా మంతనాలు జరిపారు.