జనసేనకు పార్టీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే అని వైయస్ షర్మిల అన్నారు. పవన్ కల్యాణ్ యాక్టర్, ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్. అందుకే పవన్ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని అన్నారు. జనసేనకు ఒటేస్తే కచ్చితంగా చంద్రబాబుకు ఒటేసినట్టేనన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో వైసీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తెనాలిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు. అవినీతి పోవాలంటే, ఉద్యోగాలు రావాలంటే జగన్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందంటూ చేస్తున్న దుష్ప్రచారంపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. తమకు ఏ పార్టీతోను పొత్తు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ మోసం చేసిందన్నారు. లోకేశ్కు ఏ అర్హత ఉందని మూడు మంత్రిత్వ శాఖలు అప్పచెప్పారని ప్రశ్నించారు. జగనన్న తప్పకుండా సీఎం అవుతారు.
రాజశేఖరరెడ్డి పాలన గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేంది. ఏ వ్యాధి అయినా, ఏ ఆస్పత్రి అయినా ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉండేంది. ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలనేది వైఎస్సార్ కళ. నీది నాది అనే తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు వైఎస్సార్ మాత్రమే. రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. 2014 ఎన్నికల్లో 600కు పైగా వాగ్ధానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే అందులో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో వైఎస్సార్ పాలన చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు.