ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో మరియు పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా స్పందించారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో అందరికి చూపించారు.ద్వివేది ఓటు వేసిన వీడియోను అధికారులు శనివారం విడుదల చేయడంతో తెలుగు తమ్ములకు దిమ్మతిరిగింది. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈవీఎంలో పనిచేయకపోవడంతో ద్వివేది ఓటు వేయలేకపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నారు.దీంతో వీడియో చూసిన ప్రతీఒక్కరికి అసలు విషయం తెలిసింది.