నిజాయితీగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా, ఫైనాన్సియల్ గా వాడుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసకోమ్మంటే మొహం చాటేశాడని ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ కు ఇంబ్రహీంపట్నంకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగారు. యువతిని తరుచు డబ్బులు కావాలంటూ వాడుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి తరుచు అడుగడంతో మాట్లాడటం మానేశాడు. ఫోన్ చేస్తే కట్ చేసేవాడట. లాస్ట్ కు మొబైల్ నంబర్ మార్చేయడంతో..ఆ యువతికి ఏం చేయాలో అర్ధంకాక..ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.
న్యాయం చేయాలని జోసెఫ్ ఇంటి ముందు బైటాయించింది. మీడియాతో మాట్లాడుతూ.. జోసెఫ్ తనను పెళ్ళి చేసుకోవాలని.. లేదంటే అతడి ఇంటి ముందే సూసైడ్ చేసుకుంటానని తెలిపింది. ఈ విషయంపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని..అందుకే రోడ్డు పైకి వచ్చానని తెలిపింది. ఎలాగో పరువుపోయింది. ఇక చావైనా..బ్రతుకైనా తన ప్రియుడు జోసెఫ్ తోనే అని చెబుతూ కన్నీరుమున్నీరయ్యింది.