తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్లో చేరిన సినీ కమెడీయన్, నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటనలతో వార్తలతో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తన కామెడీని కూడా పంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే…బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించాడు. హుజూర్నగర్ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణకు కాబోయే సీఎం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కూడా వెల్లడించాడు. సీఎం అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఇలా భారీ డైలాగ్లు కొట్టిన బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో తెరమరుగు అయ్యారు. కొద్దికాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గణేష్ తాను రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్టుసోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు.” అని ట్వీట్ చేశారు. “కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను.” అంటూ బండ్ల గణేష్ మరో ట్వీట్ చేశారు.
అలా రాజకీయంగా తెరమరుగు అయిన బండ్ల గణేష్ మల్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నరని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సినిమాలో బండ్ల గణేష్ ఒక ఎంటర్టైనింగ్ రోల్ చేస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. మళ్లీ కెమెరా ముందుకు రానున్న బండ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే.