Home / ANDHRAPRADESH / ఆస్పత్రిలో చంద్రబాబు ప్రత్యర్థి.. జగన్ పరామర్శ..!!

ఆస్పత్రిలో చంద్రబాబు ప్రత్యర్థి.. జగన్ పరామర్శ..!!

 

అనారోగ్యంతో బాధపడుతున్న కుప్పం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం పరామర్శించారు. హైదరాబాద్‌లో చంద్రమౌళి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి వెళ్లిన జగన్‌.. వైద్యులతో మాట్లాడారు. చంద్రమౌళికి అందిస్తున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఎన్నికల్లో చంద్రమౌళి ప్రచారం చేయలేదు. ఆయన తరఫున కుటుంబసభ్యులే ప్రచార బాధ్యతలు చేపట్టారు. మాజీ ఐఏఎస్‌ అధికారైన కె.చంద్రమౌళి 2014 ఎన్నికల్లో కూడా కుప్పం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేతిలో 47,121 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat