కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ.. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు.. గాలి బ్యాచ్కు ప్రోత్సాహం ఇస్తోందంటూ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన ప్రియాంక… గురువారం రాత్రి పార్టీకి గుడ్బై చెప్పి ఝలక్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత అయిన ప్రియాంక కొద్ది కాలం క్రితం మధురలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతలు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, తాజాగా పార్టీ నేత జ్యోతిరాదిత్య సింథియా వారిపై సస్పెన్సన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక చతుర్వేది సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు.. గాలి బ్యాచ్కు ప్రోత్సాహం ఇస్తున్నారంటూ. పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఈ మేరకు ఆమె ఐఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల రాజీనామా లేఖను రాశారు. ప్రియాంక నిర్ణయంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.