ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేయాలంటే చేస్తే పగలు డ్యూటీ అయిన చేయాలి.. లేదా రాత్రి షిప్ట్ డ్యూటీ అయిన చేయాలి. అయితే పగలు ఉద్యోగం చేసేవారి కంటే రాత్రి సమయంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువగా అనారోగ్యపాలవుతారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.ఇటీవల ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే షిప్ట్ లో పనిచేసేవారిని, రాత్రి షిప్ట్ లో పనిచేసేవారిపై ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మొత్తం 1593మందిని పగలు షిప్ట్ ,రాత్రి షిప్ట్ డ్యూటీ చేసేవారిపై సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో పగటి సమయంలో పనిచేసే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవనీ, రాత్రి సమయాల్లో పనిచేసే వారు డయాబెటీస్, మెటబాలిక్ సంబంధ వ్యాధుల వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తేలింది.వీరందరి బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ) ప్రకారం పరిశీలకులు ఈ సర్వేను ప్రకటించారు. రాత్రి సమయాల్లో పనిచేసే వారు నిద్రలేమికి సంబంధించిన హానికరమైన సమస్యలతో సతమతమవుతుంటారని తేలింది.
వారి ముఖంలో వర్చస్సు కూడా తగ్గిపోతుందని పరిశీలకులు కనుగొన్నారు. దీంతో పాటు రాత్రి సమయాల్లో పనిచేసే వారు ఉదయం సమయాల్లో పనిచేసే వారికంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఈ సర్వేలో తెలిపారు. తరుచుగా పనిచేసే సమయాలు మారడం, పగటి సమయాల్లో నిద్ర రాకపోవడం వంటి వాటి వల్ల వారు పనిపైన దృష్టి పెట్టలేకపోతారని ఈ సర్వే తేల్చి చెప్పింది. అలాగే ఉదయం పని చేసేవారి కంటే రాత్రి పూట పని చేసేవారు బరువెక్కువగా ఉంటారని ఈ సర్వేలో తేలింది.