తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ లాంటి పథకాలు
దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ దగ్గర అమలుచేస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు కూడా వేస్తోన్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆ శాఖ సంచాలకుడు పీ కరుణాకర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు అందిస్తోన్న ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల విధానం బాగుంది.ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఈ పాస్ విధానంలో పోస్ట్ మెట్రిక్ ఫీజులు చెల్లించడం దేశానికి ఆదర్శమని “ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అంతకుముందు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల తాజా పరిస్థితి,టీ వ్యాలెట్ విధానంతో విద్యార్థులకు ఫీజు చెల్లింపుల విధానంపై అడిగి తెల్సుకుని ప్రశంసలు
కురిపించారు.