Home / SLIDER / తెలంగాణ”ఫీజు రీయింబర్స్ మెంట్” దేశానికి ఆదర్శం

తెలంగాణ”ఫీజు రీయింబర్స్ మెంట్” దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ లాంటి పథకాలు
దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ దగ్గర అమలుచేస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు కూడా వేస్తోన్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆ శాఖ సంచాలకుడు పీ కరుణాకర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు అందిస్తోన్న ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల విధానం బాగుంది.ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఈ పాస్ విధానంలో పోస్ట్ మెట్రిక్ ఫీజులు చెల్లించడం దేశానికి ఆదర్శమని “ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అంతకుముందు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల తాజా పరిస్థితి,టీ వ్యాలెట్ విధానంతో విద్యార్థులకు ఫీజు చెల్లింపుల విధానంపై అడిగి తెల్సుకుని ప్రశంసలు
కురిపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat