తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణభవన్ లో మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ పై విశ్వాసంతోనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతున్నరని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి జీవనాడి అని..వెట్ రన్ ను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నరని అన్నారు.