‘శ్రద్ధా శ్రీనాథ్’ తెలుగు ప్రేక్షకులకు జెర్సీ సినిమాతో ‘సారా’గా పరిచయం అయింది.శ్రద్ధా తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్.ఈమె హైదరాబాద్ లో 7 నుంచి 12 తరగతి వరకు చదివింది.తండ్రి ఉద్యోగరీత్య పై చదువులు అన్ని రాజస్తాన్,మధ్యప్రదేశ్,ఉత్తరఖాండ్,అస్సాం రాష్ట్రాల్లో పూర్తిచేసింది.ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది.శ్రద్ధా యాక్టర్ కాకముందు లాయర్ గా ప్రాక్టీస్ చేసింది.’లా’ పూర్తి చేసుకున్న తరువాత అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ లాయర్ గా పనిచేసింది.అనంతరం ఒక ఫ్రెంచ్ కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా పనిచేసింది.
శ్రద్ధా వ్యాపార ప్రకటనలు చేస్తున్న రోజుల్లో కన్నడ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది..కాని ఆ చిత్రం విడుదల కాలేదు.అనంతరం ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాలో నటించింది.2016లో ఊహించని ఛాన్స్ దర్శకుడు పవన్ కుమార్ రూపంలో ఆమెకు దక్కిందని చెప్పుకోవాలి.ఈ భామ కన్నడ సినిమా ‘యూ టర్న్’ తో అందరి దృష్టిలో పడింది.ఈ ఏడాది ‘మిలన్ టాకీస్’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.ఇందులో శ్రద్ధా నటన మంచి గుర్తింపు తెచ్చింది.