ఏపీలో టీడీపీ నేతల గురించి వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డాడు. రాజమండ్రి టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పరారీలో ఉన్నారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే 23 తర్వాత ఇంకెంత మంది అజ్ణాతంలోకి వెళ్తారో? అంటు ట్వీట్ చేశారు . ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే 23 తర్వాత ఇంకెంత మంది అజ్ణాతంలోకి వెళ్తారో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 1, 2019