తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమరం హడావుడి ఉన్న సంగతి విధితమే. అందులో భాగంగా ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు పోటిపడి మరి తొలివిడత ఎన్నికలకు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే, తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2116ఎంపీటీసీలలో ఎన్నికలు జరగనున్నాయి.
వీటికి ఈ నెల ఆరో తారీఖున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మొత్తం అరవై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ అరవై ఏడు స్థానాల్లో ప్రభంజనం సృష్టిస్తూ ఏకగ్రీవం సొంతం చేసుకుంది.మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే తొలి విడతలో ఎన్నికలు జరగనున్న నూట తొంబై ఏడు స్థానాల్లో జగిత్యాల,నిజామాబాద్ జిల్లాలో ఒకొక్క స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.