ఎన్నో ఏళ్లు..ఏంతో ఒత్తిడి..తీవ్ర ఇబ్బందులు, కేసులు, కష్టాలు, కన్నీళ్లు అన్ని ప్రజల కోసం తట్టుకున్న ఏకైక వ్యక్తి అతనే వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన పరిణామలు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎన్నో సార్లు ప్రభుత్వంపై ప్రజల తరుపున వైఎస్ జగన్ విరుచుకుపడ్డాడు. గత 5 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన 600 అబద్దపు హామిలతో నిరాశ పర్చాడని అన్ని పార్టీలు బహిరంగగానే విమర్శించాయి.
దీంతో టీడీపీ తీవ్ర వ్యతీరేకత వచ్చింది. అనుకున్నట్టుగానే మళ్లీ ఎన్నికలు ముగిశాయి. కాని ఫలితాలకోసం అందరూ అసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు వెలువడడానికి ఎక్కవ సమయం ఉండటంతో ప్రజలు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ఎన్నికలపై ఇప్పటికే ఎన్నికల్లో ఎవరిది గెలుపో అని ఎన్నో సర్వేలు వచ్చాయి.
అన్ని సర్వేలు వైఎస్ జగన్ సునామీ అని తెలిపాయి. తాజాగా ఫలితాలను వెల్లడించిన ఓ సర్వేలో ఏపీ వైఎస్ జగన్ సునామీ ఖాయం అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ దాటీ భారీ విజయం జగన్ పార్టీకి ఉంటుందని ఆ సర్వే తెలుపుతుంది .. వైసీపీ దాదాపు 130 స్థానాలు వరకూ గెలుచుకుంటుందని ,తెలుగుదేశం పార్టీ 43 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇక జనసేన మాత్రం 2 సీట్లకంటే ఎక్కువ రావని సర్వే తేల్చి చెప్పింది.మిగిలిన ఏడు సీట్లలో టీడీపీ వైసీపీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.