వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.చంద్రబాబు చెబుతున్న అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు.
వీటన్నిటికి ముఖ్య పాత్ర పోషించింది మాత్రం చంద్రబాబేనని ఈ దొంగల ముఠా నాయకుడు బాబుగారేనని అన్నారు.చంద్రబాబు ఒరిస్సాకు ప్రకటించిన రూ.15 కోట్లు తుపాను సాయం చంద్రబాబు తాను దోచుకున్న సొమ్ము నుంచి చెల్లించాలి. ప్రాణ నష్టం లేకుండా అధికారులు తుపానును సమర్థంగా ఎదుర్కొంటే, కోడలిని వేధించే అత్తలాగా అధికారం లేకున్నా విరాళం ఇస్తానంటారు. రేపో మాపో ఒరిస్సా వెళ్లి హడావుడి చేసినా చేస్తారు.అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఒరిస్సాకు ప్రకటించిన రూ.15 కోట్లు తుపాను సాయం చంద్రబాబు తాను దోచుకున్న సొమ్ము నుంచి చెల్లించాలి. ప్రాణ నష్టం లేకుండా అధికారులు తుపానును సమర్థంగా ఎదుర్కొంటే, కోడలిని వేధించే అత్తలాగా అధికారం లేకున్నా విరాళం ఇస్తానంటారు. రేపో మాపో ఒరిస్సా వెళ్లి హడావుడి చేసినా చేస్తారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2019
తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. ఈ దొంగల ముఠా నాయకుడు చంద్రబాబే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2019