Home / 18+ / మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..

మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..

ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. మోడి కుట్ర చేసారని, జగన్ ని గెలిపిస్తున్నారని, దీనికి కేసీఆర్ సహకరిస్తున్నారంటూ అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు..

ఈక్రమంలో మొదటిసారి చంద్రబాబు నాయుడికి ప్రధాని మోదీ పరోక్షంగా చురకలంటించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని దారుణంగా విమర్శించారు. హర్యానాలోని రోహతక్‌లో మోదీ మీడియాతో మాట్లాడుతూ మొదటి మూడు విడత ఎన్నికల సమయంలో విపక్షాలన్నీ తననే టార్గెట్ చేశాయని, కానీ గాలి ఎటు వీస్తుందో అర్థమయాక యూటర్న్ తీసుకున్నారన్నారు. వారు ఓడిపోతామని తెలిశాక ఇప్పుడు ఈవీఎంలను నిందిస్తున్నారంటూ చంద్రబాబునుద్దేశించి కూడా విమర్శించారు. ఇప్పటివరకూ మీరు గెలిచారు కాబట్టి ఈవీఎంలు మంచివయ్యాయి.. ప్రజావ్యతిరేకతతో ఓడిపోతున్నారు కాబట్టి ఈవీఎంలు చెడ్డవయ్యాయంటూ విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు. అనవసరంగా ఎన్నికల సంఘాన్ని దూషించొద్దని మోడి కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat