తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై చర్చేందుకు రాజధాని మహానగరం హైదరాబాద్ లో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,మాజీ మంత్రులు సమావేశమయ్యారు.ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గూడూరు నారాయణ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,చిట్టెల రామ్మోహాన్ రెడ్డి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణుల ఫీలింగ్. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మాత్రం ఇటీవల టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోండా సురేఖ,మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, నాయిని రాజేందర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం..