సైబరాబాద్ పోలీసులుతో కలిసి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) నిర్వహిస్తున్న నిఘానేత్రం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల నిర్వహణకు ప్రముఖ అంతర్జాతీయ ఐటీ, బిజినెస్ కన్సెల్టింగ్ సంస్థ అయిన సీజీఐ కంపెనీ విరాళం అందించింది. సీజీఐ కంపెనీ ఆసియా పసిఫిక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ఫర్ ఎక్సాలెన్సీ హెడ్ జార్జ్ మట్టక్కల్, ఎస్సీఎస్సీ సెక్రెటరీ కృష్ణ ఏదుల సమక్షంలో సోమవారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ను 25.87 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సిపి వీసీ సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేవలం 13 నెలల సమయంలోనే 75,000 కు పైగా సిసిటివిలను ఏర్పాటు చేశామన్నారు. వీటి నిర్వహణకు నెలకు లక్షన్నర ఖర్చు వస్తుందన్నారు. సీజీఐ కంపెనీ నిర్వహణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా 150 సిసిటివి ల నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
రక్షణ అనేది కేవలం పోలీసులకు మాత్రమే పరిమితమైన కాదని, ప్రజలందరూ భాగస్వాములు కావలన్నారు. సిసిటివి ల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు సైతం తమ వంతు బాధ్యతగా ముందుకు రావడం శుభపరిమాణమన్నారు. ఇంకా మరిన్ని కార్పొరేట్ కంపెనీలు ముందుకురావాలని కోరారు.సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల మాట్లాడుతూ ప్రజల రక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న నిఘానేత్రం కార్యక్రమంలో ప్రతీ కంపెనీ ముందుకు వచ్చి తమ సహకారాన్ని అందించాలని కోరారు. నిఘానేత్రానికి విరాళం అందించే ఉద్యోగులకు 80 జి కింద ట్యాక్స్ మినహాయింపు ఉంటుందన్నారు. అనంతరం సీజీఐ కంపెనీ గ్లోబల్ హెడ్ హెడ్ జార్జ్ మట్టక్కల్ మాట్లాడుతూ సమాజహితం కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో సైబరాబాద్ పోలీసులతో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., సీజీఐ కంపెనీ ఆసియా పసిఫిక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ఫర్ ఎక్సాలెన్సీ హెడ్ జార్జ్ మట్టక్కల్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, ఎస్సీఎస్సీ అసోసియేట్ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి (పిసిఎస్ రెడ్డి), సీజీఐ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.