సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఈ చిత్రం తరువాత మహేష్ కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్నాడు.ఈ చిత్రం షూటింగ్ జూలై లో ప్రారంభం కానుంది.ఇందులో ఫుల్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందట.ఈ చిత్రం సంక్రాంతి భరిలో దిగనుంది.అనంతరం మహేష్ 2020లో పరశురాంతో చేయనున్నారు.దీనికి అల్లు అరవింద్ నిర్మాతగా ఉండగా ఈ చిత్రం పూర్తికావడానికి డైరెక్టర్ 6నెలలు గడువు అడిగారట.అయితే ఇందులో మహేష్ ఒక బ్యాంక్ ఫ్రాడ్ గా చేయబోతున్నాడని సమాచారం.